. పాలుపట్టి లాలించిన ప్రధాని
అహ్మదాబాద్, బతుకమ్మ: పాలనా వ్యవహారాల్లో తనదైన శైలిలో వ్యవహరిస్తూ రాజకీయ పులిగా గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోడీ పులి పిల్లలతో సరదాగా గడిపారు. వాటితో ఆటలాడుతూ పాలుపట్టి లాలించారు. గుజరాత్ లో పర్యటిస్తున్న మోడీ రిలయన్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రమైన వంతారాను ఆయన ప్రారంభించారు. పులిపిల్లలకు డబ్బా ద్వారా పాలుపట్టారు. వన్యప్రాణులకు వైద్యం అందించే కేంద్రాన్ని పరిశీలించారు. జిరాఫీలతోపాటు ఇతర జంతువులకు ఆహారం అందించారు.