కరీంనగర్, బతుకమ్మ: పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి 6,712 ఓట్లు సాధించి ఆధిక్యంలో ఉన్నారు. ఒక్కో రౌండ్ కు 21 టేబుళ్లపై వెయ్యి చొప్పున 21 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. కాగా నరేంద్ రెడ్డి 6676, ప్రసన్న హరిక్రిష్ణ 5867, రవీందర్ సింగ్ 107, మహ్మద్ స్తాక్ అలీ 156, యాదగిరి శేఖర్ రావు 500 ఓట్లు సాధించారు.
