రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం

0 9,151

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగర శివారులో బాటసింగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  మంగళవారం ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందింది. వివరాలు ఇలా..  బాటసింగారం సర్వీస్ రోడ్డుపై ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.  ఈక్రమంలో ఓ బైక్ పై ఉన్న విద్యార్థినులు కిందపడిపోగా,  అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న లారీ కింద హంసలేఖ (22)  అనే ఇంజినీరింగ్ విద్యార్థి పడిపోవడంతో అక్కడికక్కడే మతి చెందింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.