హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగర శివారులో బాటసింగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందింది. వివరాలు ఇలా.. బాటసింగారం సర్వీస్ రోడ్డుపై ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈక్రమంలో ఓ బైక్ పై ఉన్న విద్యార్థినులు కిందపడిపోగా, అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న లారీ కింద హంసలేఖ (22) అనే ఇంజినీరింగ్ విద్యార్థి పడిపోవడంతో అక్కడికక్కడే మతి చెందింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.