నిజామాబాద్, బతుకమ్మ : ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రాతఃకాల వేళ మాడ వీధుల్లో నిర్వహించిన శ్రీవారి పల్లకీ సేవలో దిల్ రాజు దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు పాల్గొన్నారు. విజయసింహారెడ్డి దంపతులు వారితోపాటు నర్సింగపల్లి గ్రామస్తులు సేవకులు నరాల సుధాకర్ నర్సారెడ్డి ప్రసాద్ రమేష్ భాస్కర్ మురళి గంగారెడ్డి రాజేశ్వర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు, అలాగే నగరంలోని జెండా బాలాజీ ఆలయం, ఉత్తర తిరుపతి క్షేత్రం ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల రద్దీ నెలకొంది.
ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పల్లకీ సేవలో పాల్గొన్న దిల్ రాజు దంపతులు

