నిజామాబాద్, బతుకమ్మ : సీపీఎ స్ ను రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ ఉద్యోగ జేఏసీ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కు ఓ పీ ఎస్ కోసం పోరాటం చేస్తామని తెలిపారు. సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.