భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన జిల్లా అధ్యక్షులు మూడ్ ఇంధల్ నాయక్ ఆధ్వర్యంలో యూత్ భీమ్ గల్ మండలం అధ్యక్షులు కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ వారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. భీమ్ గల్ మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షులుగా మలావత్ సంతో ష్ నాయక్ దేవునిపల్లి తండా,గౌరవ అధ్యక్షులుగా పాలిత్య శివ నాయక్ సంతోష్ నగర్ తండా, ప్రధాన కార్యదర్శిగా ఆకాష్ నాయక్ కారేపల్లి తండా,కోశాధికారిగా భూక్య గణేష్ నాయక్ పెద్దమడితండ,ఉపాధ్యక్షులుగా శేఖర్ నాయక్ సంతోష్ నగర్ తండా, జాయింట్ సెక్రటరీగా మూడ్ నవీన్ నాయక్ సుదర్శన్ నగర్ తండా,సలహాదారులుగా మాలావత్ సుమన్ నాయక్ దేవునిపల్లి తండా అధ్యక్షుడు మాట్లాడుతూ ఎల్లవేళలా బంజారా సమాజానికి నా వంతుగా మంచి పనుల కోసం పోరాడుతానని అన్నారు ఇందల్ నాయక్ జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్ కార్యవర్గంలో పనిచేస్తానని రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ నేతృతంలో ముందుకు సాగుతానని కోరుకుంటూ మాకు ఈఅవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బానోత్ శ్రీరామ్ నాయక్,జిల్లా యువజన ఉపాధ్యక్షులు అనిల్ నాయక్,కేతావత్ రమేష్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.
