27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వెస్ట్ మారేడుపల్లిలో ముగిసిన ఈడీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో వెస్ట్ మారేడుపల్లిలో  ఈడీ సోదాలు ముగిశాయి.  వ్యాపారవేత్త బూరుగు రమేశ్, అతని కుమారుడు విక్రాంత్ నివాసాల్లో 7 గంటలు పాటు సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ జ్యూవెలర్స్ తో పాటు రాజశ్రీ ఫుడ్స్ లో డైరెక్టర్ గా బూరుగు విక్రాంత్ కొనసాగుతున్నారు.   ఏపీ లిక్కర్ స్కాం కేసులో షెల్ కంపెనీలకు నగదు మళ్లించినట్లు గుర్తించారు.  వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో నగదు, షెల్ కంపెనీలకు సంబంధించి కీలక పత్రాలను అధికారులు సీజ్ చేశారు.

More articles

Latest article