వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు చెందిన సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నై, హైదరాబాద్ లోని 10 చోట్ల తనిఖీలు చేశారు. బ్యాంకులను రూ. 200 కోట్ల మోసం చేశారని సీబీఐ నమోదు చేసిన కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. జీఆర్ కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. జీఆర్ కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు.