నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ వర్సిటీ మైనార్టీ సెల్ డైరెక్టర్ గా డా. మహ్మద్ అహ్మద్ ఖవి ని నియమిస్తూ వైస్ _ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు. డా. మహ్మద్ అబ్దల్ ఖవి దశాబ్ద కాలంగా ఉర్దూ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నారు. డా.మహ్మద్ అబ్దల్ ఖవి గతంలో ఉర్దూ డిపార్ట్మెంట్ హెడ్ గా, బి ఓ ఎస్ చైర్మన్ గా, పి. ఆర్ ఓ.( డైరెక్టర్) గా,చీఫ్ వార్డెన్ గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ గా, ఎగ్జామ్ బ్రాంచ్ అడిషనల్ కంట్రోల్ గా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈక్వల్ ఆపరేటివ్ సెల్ చైర్మన్ గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందినారు.