బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలోని లద్దిదారులకు ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని బాన్సువాడ పట్టణం కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించారు. బాన్సువాడ పట్టణం, గ్రామీణ మండలానికి చెందిన 46మంది లబ్దిదారులకు, బీర్కూర్ మండలంలోని 30మందికి, నసురుల్లాబాద్ మండలానికి చెందిన 23మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, బాన్సువాడ పట్టణ, బాన్సువాడ గ్రామీణ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

