27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందల్వాయిలో రోగులకు పండ్లు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చిలువేరి దాసు మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని జోస్యం చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పని చేస్తే రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శెట్టి బిరీష్, పార్టీ సీనియర్ నాయకులు కుమార్, మాజీ ఎంపీటీసీలు సుధాకర్, చింతల దాసు, రాంరెడ్డి, మఠంల నాగేష్ ,నామాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article