24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కోర్టు పేషీలకు గైర్హాజరు… ఇద్దరి కి రిమాండ్ విధించిన కోర్టు

Must read

📰 Generate e-Paper Clip

 ఎల్లారెడ్డి, బతుకమ్మ:

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ధరావత్ రమేష్,  మక్కల గంగాధర్ గత కొన్ని రోజులుగా కోర్టు పేషీలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ వారిపై నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. కోర్టు పెషిలకు హాజరు కాని రమేష్ , గంగాధర్ లను సోమవారం ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్లారెడ్డి ఎస్ ఐ బి. మహేష్  తెలిపారు. కోర్టు వాయిదాలకు హాజరు కాని వ్యక్తులు కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిగా పరిగణించబడతారు అలాంటి వ్యక్తులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని ఎస్సై తెలిపారు.

More articles

Latest article