భీమ్ గల్, బతుకమ్మ: మండలం కేంద్రానికి చెందినవారితోపాటు బడా భీమ్ గల్ కు చెందిన పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ సోమవారం పరామర్శించారు. బడా భీమ్ గల్ కు చెందిన పాత్రికేయుడు ధనుంజయ్ తండ్రి ముత్తెన్న, మండల కేంద్రానికి చెందిన ద్యాగ నర్సయ్య తండ్రి చిన్న నర్సయ్య ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాలను సునీల్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
