. . . రూరల్ ఎమ్మెల్యే భుపతిరెడ్డి ని కోరిన బాపూజీ వచనలయ కమిటీ సభ్యులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాదు రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి , ఉర్దూ అకాడమీ చేర్మెన్ తాహేర్ బిన్ హందన్ ను బాపూజీ వచనలయ అధ్యక్షులు గడ్డం భక్తవత్సలం నేతృత్వంలో నూతన కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలసి సన్మానించారు ఈ సందర్బంగా రూరల్ శాసనసభ్యులు మాట్లాడుతూ బాపూజీ వచనలయానికి పూర్వ వైభవం తీసుకోనిరావలన్నారు. ఎంతో మంది విద్యార్థులు బాపూజీ వచనలయం లో చదువుకొని ఉన్నత స్థాయి లో ఉన్నారని అన్నారు. విద్యార్థుల కు అన్నిరకాల బుక్స్ అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులకు కోరారు విద్యార్థుల భవిష్యత్తు అలోచించి మెరుగైన వసతులు కల్పించి వారికీ మీరంతా ఉన్నత రంగం లో ఉండానికి ప్రోత్సహించాలని కోరారు ఉర్దూ అకాడమి చేర్మెన్ తాహేర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర కల్గిన బాపూజీ వచనలయానికి నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కి సహకరించాలని పిలుపునిచ్చారు నూతన కమిటీ వారు అభివృద్ధి కి అడుగులేస్తూ త్వరలోనే నూతన భవనాన్ని పూర్తి చేసి నూతన సౌకర్యాలతో కూడిన లైబ్రరి ని అందుబాటులో ఉంచాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం ఉన్న మీ అభివృద్ధి కి సహకరిస్తాను అని అన్నారు .ఈ కార్యక్రమం లో కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, కోశాధికారి బి. గంగాధర్ రావు, ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, సంయుక్త కార్యదర్శి సాంబయ్య, సభ్యులు లక్కం రెడ్డి, కోవూరు జగన్, ఆమంద్ విజయ్,పుల్గం హనుమండ్లు,అరేట్టి లక్ష్మి నారాయణ, గందరి మహిపాల్ రెడ్డి, ప్రతాప్ రుద్ర, గోవింద్ ప్రసాద్ జవర్,పాటి అనిల్ రెడ్డి, మహ్మద్ ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు.

