మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన బీజేపీ మోర్తాడ్ మండల ఉపాధ్యక్షులు కుంట శ్రీనివాస్ రెడ్డి నాయనమ్మ ఇటీవల స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న పసుపు బోర్డ్ చైర్మన్ గౌరవ పల్లె గంగారెడ్డి ఆదివారం కుంట శ్రీనివాస్ రెడ్డి, కుంట గంగ రెడ్డి, పిప్పెర రామ్ రెడ్డి లను వారి నివాసం లో పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా కార్యదర్శి సంఘం అనిల్ కుమార్, బీజేపీ ఆర్మూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్, కిసాన్ మోర్చా మోర్తాడ్ మండల ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
