. . . ప్రభుత్వ సలహాదారు, పీసీసీ చీఫ్ ల కు మున్నూరు కాపు సంఘం అహ్వనం
హైదరాబాద్, బతుకమ్మ :
జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 13న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నం దానికి హాజరు కావాలని నిిజామాబాద్ నగర తొలి మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పోద్ధుటురి సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరులకు అహ్వనం అందచేసి స్వాగతం పలికారు. వారితో పాటు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులను కలిసి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యవర్గ నాయకులు ఆకుల చిన్న రాజేశ్వర్, కౌడపు శరత్, బంటు బలరాం, బంటు శంకర్, అదే నర్సయ్య, అంగిరేకుల సాయిలు, పుప్పాల రవి, ఉల్లేంగ నాగరాజు తదితరులు ఉన్నారు.
