మెండోరా, బతుకమ్మ:
అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక నడిపిస్తున్న ట్రాక్టర్లు పట్టుకున్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. మెండోరా ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మెండోరా గ్రామం లో వివేకానంద విగ్రహం వద్ద ముప్కాల్ గ్రామానికి చెందిన ఆలకుంట ప్రవీణ్ దొంగతనంగా ఇసుక ను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వెనుక ప్రాంతం నుండి మెండోరా గ్రామానికి తన ట్రాక్టర్ లో తరలిస్తుండగా పట్టుకుని ట్రాక్టర్ ను స్వాధీన పరచుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Next Post