. . . అధికార కాంగ్రెస్ నుండి నలుగురు దరఖాస్తు
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నిక దరఖాస్తు చివరి రోజు భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేసిన కాసుల రోహిత్, మొహమ్మద్ మజీద్, (ముజ్జు), కొర్ల ప్రతిమ నరేష్ రెడ్డి, ఖమర్ సుల్తానా గౌస్ లు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు వినయ్ కుమార్ స్వామి, తాడ్కోల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర నార్ల నందకిషోర్, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ కాలేకే, హకీమ్, రమేష్ కాటికే, జంగం రాజు, నాగేష్, రుక్మిణి, మాజీ వార్డు సభ్యులు సలీం, కొత్త అశోక్ తదితరులు పాల్గొన్నారు.

