బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గురువారం చౌట్ పల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులను రూ. 44 లక్షల నిధులతో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. పైప్లైన్ లీకేజి వల్ల నీటి సరఫరా సమస్యలు తలెత్తడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవ తీసుకొని మరమ్మత్తులు కావాలసిన నిధులను మంజూరు చేయించారని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
