కోటగిరి, బతుకమ్మ :
కసాయిగా మారినా కొడుకు నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లినే హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని బ్రాహ్మణ గల్లికి చెందిన మానాజీ అనే వ్యక్తి మద్యానికి బానిసై మద్యం మత్తులో శుక్రవారం రాత్రి తన ఇంట్లో తల్లి భూమవ్వపై దాడి చేసి ప్రాణాలతోనే ఉండగానే ఇంట్లోని పాత బట్టలు వేసి కాల్చి హత్య చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
