వెబ్ న్యూస్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ పాలనపై బీఆర్ఎస్ పార్టీ న్యూ ఇయర్ సందర్భంగా సెటైరికల్ ట్వీట్ చేసింది. కాగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈట్వీట్ వైరల్ అవుతోంది.
2 – రెండేండ్ల సమయం వృథా
0 – కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు గుండు సున్నా!
2 – కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షలేవీ?
6 – ఇస్తామన్న గ్యారంటీలు ఎక్కడ?
’గద్దెనెక్కి రెండేండ్లు గడిచినా..ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవీ సరిగ్గా అమలు చేయకుండా సమయం వృథా చేసింది. ఎన్నెన్నో హామీలిచ్చి.. మాయ మాటలు చెప్పి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసింది కాంగ్రెస్!‘ అని బీఆర్ఎస్ పార్టీ ’ఎక్స్‘ ఖాతాలో ట్వీట్ చేశారు.
