ఆదిలాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ (బీజేపీ) ఇంటిని బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. పత్తి కొనుగోళ్ల పరిమితి పెంపు డిమాండ్ తో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పలువురు నేతలు ఎంపీ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పత్తి కొనుగోళ్లను ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితం చేస్తూ ఇటీవల సీసీఐ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

