26.3 C
Hyderabad
Monday, August 3, 2026

గౌరారంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని గౌరారం గ్రామంలో ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఏటా గ్రామ ప్రజలందరూ కలిసి ఎల్లమ్మ తల్లికి బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఉదయాన్నే లేచి ఇంటిని శుద్ధి చేసుకొని ఇంటికి చుట్టాలను ఆడపిల్లలను పీల్చుకొని కొత్త బట్టలు ధరించి గ్రామ పొలిమేర పూజ చేసి ఊరేగింపుగా బోనం నైవేద్యాలు ఎత్తుకొని  మహిళలు ఆటపాటలతో బ్యాండ్ మేళం శివసత్తుల నాట్యాలు చూపరులను కట్టిపడేసాడు ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎల్లమ్మ తల్లికి బోనాలు నైవేద్యాలు సమర్పించి వివిధ రకాలుగా ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాన్ని పచ్చగా చూడాలని చల్లగా ఉండాలని ప్రజలందరూ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హనుమంతరావు పటేల్ మాజీ సర్పంచ్ అనసూయ శంకర్ నాయకులు జె శంకర్ మహేష్ గుప్తా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article