భీమ్ గల్, బతుకమ్మ : దేశ రాజధాని డీల్లీలో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మ్రోగించడం తో భీమ్ గల్ పట్టణ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీని స్థానిక బీజేపీ నాయకులు నిర్వహించారు.ఈ సందర్బంగా సుమంగళి చౌరస్తా వద్ద టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రెసిడెంట్ మునిగే మహిపాల్,స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, పట్టణ పార్టీ ఇంచార్జ్ అరే రవీందర్, జిల్లా ఓ బి సి వైస్ ప్రెసిడెంట్ బండారి లక్ష్మణ్ గౌడ్,హరీష్, డా. వెంకటేష్, డా. పుండరికం,నీలా గంగాధర్, రాగి అజయ్,చేవ్వ లింబాద్రి,నీలం రమేష్, రాగి గణేష్,అంజయ్య, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
