బోధన్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బోధన్ లోని బీజేపీ పార్టీ అభ్యర్థులకి బీఫాంలు అందజేశారు. సోమవారం జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బోధన్ నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, బోధన్ పట్టణ అధ్యక్షులు పసిలేటి గోపి కిషన్ చేతుల మీదుగా అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. మొత్తం 14 మంది అభ్యర్థులకు బీఫామ్లు అందించగా, వాటిని సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీధర్, ఐటీ కన్వీనర్ శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి, ఎడపల్లి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.
