భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కు చెందిన ఇద్దరు స్టూడెంట్లు ఎంబిబియస్ మెడికల్ సీట్లను సాధించారు.ఇందులో భాగంగా హీనా సహార్ రాజదానిలోని గాంధీ మెడికల్ కాలేజ్ లో అరేబియా మీర్జాకు జగిత్యాల్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ల్లో సీట్లను సాధించినట్లు జీజెసీ ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదివి మెడికల్ సీట్లను సాధించి కాలేజ్ కు పేరు తెచ్చిన ఇరువురు స్టూడెంట్లను ప్రిన్సిపాల్,లెక్చరర్లు, సిబ్బంది అభినందించారు.
