24 C
Hyderabad
Sunday, August 2, 2026

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్

భీమ్ గల్, బతుకమ్మ : వర్షాకాల నేపత్యంలో సీజనల్ వ్యాదులు ప్రబలకుండా గ్రామాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ గ్రామాధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని బడా భీమ్ గల్ లో  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎం లు,ఆశాలు, అంగన్వాడీలు,ఇందిరా క్రాంతి పథకం వివోఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ   వర్షాకాలం నేపథ్యంలో గ్రామంలోయుద్ధప్రాతిపధికాన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని,పిచ్చి మొక్కల తొలగింపు, అంటి లార్వా స్ప్రే, ఫాగింగ్, క్లోరైనేషన్ చేపట్టాలన్నారు.  ప్రతి మంగళవారం,శుక్రవారం గ్రామపంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఇతర శాఖల సిబ్బందితో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించి ఇళ్లల్లో నిలువ ఉన్న నీటిని పారబోయించి,పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శివ చరణ్, కార్యదర్శి రజిత, పంచాయతీ సిబ్బంది,ఆరోగ్య సిబ్బంది, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article