మద్నూర్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో బీసీ సోదరులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసిన సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు ఆదేశాల మేరకు డోంగ్లీ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సిఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు ఫోటో కి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏఎంసి వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్, శివాజీ పటేల్, శశాంక్ పటేల్, ఉమాకాంత్ పటేల్, పురుషోత్తం పటేల్, నగేష్ పటేల్, సంగ్రామ్ పటేల్, విలాస్, శ్రీకాంత్, శ్రీధర్,నాగనాథ్, హన్మంత్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ సంఘ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.