- 8మంది అరెస్ట్
ధర్పల్లి, బతుకమ్మ : అటవీ అధికారులపై కొందరు గిరిజనులు దాడి చేసిన ఘటన శనివారం ధర్పల్లి మండలంలోని కొట్టాలపల్లి ఫారెస్ట్ సెక్షన పరిధిలో చోటు చేసుకుంది. రామారెడ్డి అటవీ ప్రాంతంలో అక్రమంగా అటవీ భూమిని దున్నుతున్న ట్రాక్టర్ ను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. దీంతో కొందరు గిరిజనులు వారిపై దాడికి దిగారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ధర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కొట్టాలపల్లికి చెందిన 8 మంది నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించారు.


