వెబ్ న్యూస్, బతుకమ్మ : రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. పెళ్లి చేసుకోమని అప్సర పూజారి సాయి కృష్ణను వేధించింది. దీంతో 2023లో శంషాబాద్ లో అప్సరను పూజారి హత్య చేసి అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని కారులో సరూర్ నగర్ తీసుకొచ్చి పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.