జక్రాన్ పల్లి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని జక్రాన్ పల్లి తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (2026-27) ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపాల్ సుధారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల సేవ మే 13 నుండి మే 25 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితా మే 27న సంస్థ నోటీసు బోర్డుపై ప్రదర్శించబడుతుందన్నారు. ధృవపత్రాల ధృవీకరణ, ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయడం మే 28 నుండి 30 వరకు జరుగుతుందన్నారు. సీట్ల కేటాయింపు ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలలోని మెరిట్, రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య, 100 మంది బాలికలకు బాలికల హాస్టల్లో ఉచిత ప్రవేశం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్బుక్లు, ఈఏపీసీఈటీ/నీట్ కోచింగ్, ఫిజిక్స్ వల్లా & ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్ లకు ఉచిత ఆన్లైన్ యాక్సెస్, కెరీర్ కౌన్సెలింగ్, బాలికలకు హాస్టల్ సౌకర్యం, మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యూటీ & వెల్నెస్ రంగాలలో వృత్తి విద్యా కోర్సులు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, పని వేళల తర్వాత వివిధ సహ పాఠ్య కార్యకలాపాలలో పాల్గొనే అవకాశాలు లభిస్తాయన్నారు. మీ కలలను సాకారం చేసే ఒక ఉన్నత విద్యాసంస్థలో భాగమయ్యే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ విద్యార్థులకు సూచించారు. ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించడానికి tgms.telangana.gov.in లింక్ లో చూసుకోవచ్చన్నారు.