ఎల్లారెడ్డి, బతుకమ్మ: శాసన మండల ఎన్నికల నేపథ్యంలో పట్టుభద్రుల ఓటు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ వరకు మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఆన్ లైన్ లో ఫారం- 18 భర్తీ చేసి లేదా తహసీల్ కార్యాలయాల్లో ఫారం – 18కి డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్సులను జత చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2021 నంబర్ లోగా డిగ్రీ పూర్తయిన వారు ఓటు హక్కు నమోదుకు అర్హులని, గ్రాడ్యుయేట్ల తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.