నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదురురికి జైలు శిక్ష, 10మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి శుక్రవారం ట్రాఫిక్ సీఐ ప్రసాద్ కౌనిలింగ్ నిర్వహించిన అనంతరం నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరు పరిచారని పేర్కొన్నారు. వారిలో 10మందికి రూ.1500 జరిమామానా విధించినట్లు తెలిపారు. రాథోడ్ విలస్ కు ఒకరోజు, ఇందూర్ నవీన్ కుమార్, కెరియర్ స్వామి ముత్తు, కనుకులొల్ల నగేష్, ఎంకమ్మల అశోక్ లకు రెండు రోజుల జైతు శిక్ష విధించినట్లు తెలిపారు.
