29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రములో ప్రభుత్వం రైతు భరోష క్రింద సాగు భూములకు డబ్బులు పడటంతో రైతు వేదికలో సమావేశం నిర్వహించుకొని సీఎం రేవత్ రెడ్డి సందేశం తర్వాత ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎకరముకు 12 వెయ్యిల చొప్పున 6 నెలలకు సగమలో భాగముగా ఈసారి 6000 రూపాయల చొప్పున సాగు భూమికి రైతులందరికీ డబ్బులు పడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మద్దతు ప్రకటిస్తూ రైతులు మోటార్ సైకిలు ర్యాలీ ఏర్గట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని సీఎం రేవంత్ రెడ్డి, ఉప సీఎం బట్టి విక్రమార్క,వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు చిత్ర పటాలకు పాలభిషేకం చేసి నినాదాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల రైతులు. ఇట్టి కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షుడు దేవా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, ఆడెం గంగ ప్రసాద్, గడ్డం జీవన్ రెడ్డి, తాళ్ల రాంపూర్ భాను,ముస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, కూరాకుల బోర్రన్న, మేకల సాయన్న, ప్రసాద్ గౌడ్, మురళి గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article