వేల్పూర్, బతుకమ్మ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పడగల్ లో ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర హో మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సంఘం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను అమిత్ షా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత ప్రజలందరికీ హోం మంత్రి క్షమాపణలు చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంఘం పెద్దలు, సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
