ఏర్గట్ల, బతుకమ్మ :
మండలంలోని అన్ని గ్రామాలలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సుమారు 200 మందికి పైగా బైక్ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు కోటగిరి రామ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చిట్యాల రాజేష్, బిసి, ఎస్సి, ఎస్టి, జేఏసీ, జిల్లా కో కన్వీనర్ దిబ్బ సుదర్శన్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ రక్షక్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు పడిగెల శోభన్, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సంగెపు ఆనంద్, ఉపాధ్యక్షులు సునీల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ మండల ప్రెసిడెంట్ జుంగల గణేష్, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు గన్నారపు రాజేశ్వర్, భట్టపూర్ ఉప సర్పంచ్ మూడ్ యానంద్, బీసీ నాయకులు రామన్న, తడపాకల్ నలిన్, అంబేద్కర్ సంఘం సభ్యులు అట్ల పోచయ్య, లక్కం నరసయ్య, చిటుమల పోలింగ్, చిటుమల అమృత్, సుదర్శన్, వివిధ గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

