29 C
Hyderabad
Monday, August 3, 2026

ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ స్థలం న్యాయవ్యవస్థకు కేటాయించండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాకోర్టు అధికారిక అవసరాలరీత్య ఓల్డ్ విద్యాశాఖ స్థలాన్ని  కేటాయించే విధంగా సహకరించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి,ప్రధాన కార్యదర్శి మానిక్ రాజు వినతిపత్రాన్ని సమర్పించారు.కోర్టుల సంఖ్య పెరగడం,కక్షిదారుల రాకపోకలు ,మోటారు వాహనాలు అంతకంతకు పెరిగిపోవడం వలన ప్రస్తుత కోర్టు ప్రాగనం కిక్కిరిసిపోవడం జరిగిందని వారు తెలిపారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఆయన విద్యాశాఖ కార్యాలయ స్థలానికి జిల్లాకోర్టు కు కేటాయించదానికి తనవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి జిల్లా కలెక్టర్ కు తగిన ఆదేశాలు జారీచేస్తామని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ను కలిసినవారిలో,బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, బార్  ఉపాధ్యక్షుడు దిలీప్, న్యాయవాదులు జి.వి.కృపాకర్ రెడ్డి, దయాకర్  గౌడ్,జి.వి.రామకృష్ణ, వి.భాస్కర్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article