నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆల్ ఫోర్స్ ఫ్రెషర్స్ పార్టీ ఆటపాటలతో సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి మాట్లాడారు. 10వ తరగతి వరకు విద్య ఒకటైతే ఇంటర్మీడియట్ లో రెండు సంవత్సరాలు కష్టపడి చదివితే ఐఐటి, ఎన్ఐటి, దేశంలోనే అత్యున్నతమైన పేరుగాంచిన యూనివర్సిటీలో తమ ఆల్ ఫోర్స్ విద్యార్థులు ఆయన అన్నారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యతోపాటు క్రమశిక్షణకు అలవాటు పడాలని అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారని ఆయన అన్నారు. తమ ఆల్ఫోర్స్ కళాశాలలో మెరుగైన ఉన్నత స్థాయి విద్యను అందించడంలో మంచి పేరు ఉందని అదే ఉద్దేశంతో నిజాంబాద్ లో ఉన్న విద్యార్థులకు మంచి విద్యను అందించి ఐఐటి, ఎంసెట్ కోర్సుల్లో మంచి కోచింగ్ శిక్షణను అందించడమే ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ప్రధాన ఉద్దేశం అన్నారు. తమ విద్యార్థులకు ఐఐటీలో చదువు కోసం

దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఐఐటి కళాశాలలో ప్రతిభను చాటారని అన్నారు. ఐఐటీ చదువులో ఐటిఐ కోసం విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరారు హిందూ విద్యార్థులు ముఖ్యంగా ఆల్ఫోస్ట్లో సర్వే విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఐఐటీలో ఉత్తీర్ణులై ఉన్నతమైన భవిష్యత్తులో స్థిరపడాలని కోరారు. అదేవిధంగా ఐఐటి నీటిలో ఉత్తమమైన శిక్షణను అందిస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా 28 ఐఐటి యూనివర్సిటీ కళాశాలలో ఉంటే అందులో 25 ఐఐటి కళాశాలలో తమ విద్యార్థులు సీట్లు తీసుకురావడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇంటర్మీడియట్లో ఈ రెండు సంవత్సరాలు చదువుపై దృష్టి పెడితే మీ జీవితమే మారిపోతుందని భవిష్యత్ బంగారమాయంగా మారిపోతుందన్నారు అప్పుడే మీ తల్లిదండ్రులు అనుకున్న లక్ష్యాలను కలలను నెరవేర్చినవారవుతారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ప్రత్యేకంగా అలరించాయి.

