. . . పాఠశాలకు నిప్పంటుకుని దగ్ధం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో పాఠశాలలో ఫైళ్ళు, ఫర్నిచర్లు అగ్నికి ఆహుతయ్యాయి. పాఠశాలలోనిబుక్స్, బెంచీలు కూడా అగ్నికి దగ్ధమయ్యాయి.
2145
ఈ ఘటన విషయం తెలిసిన అగ్నిమాపక శాఖ ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పిన అవి అదుపులోకి రాలేదు. పురాతన భవనం, పురాతన సామాగ్రి కావడంతో అగ్ని కీలలు తీవ్రంగా వ్యాపించాయి. ఆకతాయిలు నిప్పు పెట్టి ఉంటారానే అనుమానాలున్నాయి. ఖిల్లా ప్రాంతంలో పోకిరి సంచారం ఎక్కువ అని చెప్పాలి.

