25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకునేదేన్నడో..?

Must read

📰 Generate e-Paper Clip

  • వినతిపత్రం సమర్పించినా స్పందించని అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో గల బస్టాండ్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని, ఈ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ నెల 17 వ తేదీన సోమవారం రోజున జవహర్ నగర్ కాలనీవాసులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యుటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గంగాధర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. జేయన్సీ బస్టాండ్ ను 2005 వ సంవత్సరంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ బస్టాండ్ శిథిలావస్థలో ఉంది. దీనిని అదునుగా తీసుకొని ప్రక్కన గల మైనార్టీ షాదిఖాన వారు ఈ బస్టాండ్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, గత ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ఎందుకు స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Actions will be taken against those who have taken possession..?

More articles

Latest article