మద్నూర్,బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీలో వచ్చే మూడు నెలల కోటాను ముందస్తుగా పంపిణీ చేస్తున్న సందర్భంగా మండలంలోని రేషన్ డీలర్ల తో మద్నూర్ మండలం తాహసిల్దార్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. మూడు నెలల కోట పంపిణీలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, రైస్ పక్కదారి పట్టకుండా, ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని మండల నయాబ్ తహసిల్దార్ శివరామకృష్ణ అదే విధంగా మండల గిర్దవార్ ఏం శంకర్ లు డీలర్లకు ఆదేశించారు.
