23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పర్మిషన్ లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో పర్మిషన్ లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్ఎస్ వో, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం వారు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య, బుడిమి x రోడ్ లో నారాయణ పాఠశాలలపేరుతో ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని విద్యార్థి సంఘాల  నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్ఎస్ వో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్, ఏఐఎస్ఎఫ్ బాన్సువాడ కన్వీనర్ సుమన్ నాయక్,   లక్ష్మణ్ ,వికాస్, సంతోష్ వివిధ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article