బతుకమ్మ భిక్కనూరు: కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరుమండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన సమాచార ప్రకారం మండల కేంద్రానికి చెందిన చిగుళ్ల మధు (27) అనే యువకుడు గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ మానసికంగా కుంగి పోయాడు. ఎక్కడ చూపించిన తగ్గకపోవడంతో దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేరు లేని సమయంలో ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని తండ్రి బీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయికుమార్ తెలిపారు.
