వెబ్ న్యూస్, బతుకమ్మ: తన భార్యకు వాట్సాప్ లో కిస్ (ముద్దు) ఎమోజీ పంపించాడనే కోపంతో స్నేహితుడితోపాటు భార్యను హత్య చేశాడు భర్త. ఈ ఘటన కేరళ రాష్ర్టంలోని పథనం థిట్ట జిల్లా కలంజూరులో చోటుచేసుకుంది. జైబు అనే వ్యక్తి తన భార్య వైష్ణవి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వాళ్ల ఇంటి పక్కనే జైబు స్నేహితుడు విష్ణు ఉంటున్నాడు. ఇటీవల వైష్ణవి మొబైల్ కు విష్ణు వాట్సాప్ లో ముద్దు ఎమోజీ సెండ్ చేశాడు. అర్ధరాత్రి వేళ వైష్ణ వి మొబైల్ చూసిన జైబు ఆమెతో గొడకు దిగాడు. భయంతో వైష్ణవి విష్ణు ఇంట్లోకి పరిగెత్తగా ఆమె వెంటనే కొడవలితో వెళ్లిన బైజు వారిద్దరిని హత్య చేశాడు.
