. . . సాహితి స్కూల్ బస్సు బోల్తా
. . . విద్యార్థులకు గాయాలు
నవిపేట్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కమలాపూర్ వద్ద సాహితి పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటంలో మీనాక్షి, నయాన్షి అనే విద్యార్థులకు గాయాలైయ్యాయి. నాడాపూర్ గ్రామం నుంచి గురువారం విద్యార్థులను ఎక్కించుకొని బస్సు నవీపేట్ వైపు వస్తుండగా అంకాలమ్మ గుడి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
బస్సు క్లీనర్ బస్సును నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. బస్ పోలంలో బోల్తా పడటంతో పేను ప్రమాధం తప్పినట్లయింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

