. . .రైల్వే నెట్వర్క్ గరిష్ట స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే సేవలు అందిస్తోంది
. . . జాన్కంపేట్ రైల్వే గుడ్ షేడ్ ను ప్రారంభించిన ఎంపీ అర్వింద్ ధర్మపురి
నిజామాబాద్, బతుకమ్మ:
గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మౌలిక సదుపాయాలు,సామర్థ్యం పెంపు, ప్రయాణీకుల కేంద్రీకృత ప్రధాన అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. గురువారం జాన్కంపేట్ గుడ్ షేడ్ ను ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేటాయించిన బడ్జెట్ను 2014-15లో రూ. 258 కోట్లు మాత్రమే ఉండగా 2026-27 బడ్జెట్లో రూ. 5,454 కోట్లు, అంటే 20 రెట్లు పైగా పెంచారు అని గుర్తు చేశారు.గత 12 సంవత్సరాలుగా 562 కిలోమీటర్ల డబుల్ లైన్, థర్డ్ లైన్ ,ఫోర్త్ లైన్ పనులు పూర్తయ్యాయన్నారు. కొత్తగా నిర్మించిన మనోహరాబాద్ – సిద్దిపేట కొత్త రైలు మార్గం మినహా, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రైలు నెట్వర్క్ విద్యుదీకరించబడింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ. 42 వేల కోట్లకు పైగా ఉందన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో….
రూ. 4,686 కోట్ల వ్యయంతో చేపట్టిన ముద్ఖేడ్ – ధోన్ డబ్లింగ్ ప్రాజెక్ట్లో భాగంగా, ముద్ఖేడ్ – మెడ్చల్ మధ్య డబ్లింగ్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. బాసర్ – నవీపేట్ మధ్య 15 కిలోమీటర్ల విభాగం పూర్తయి, ప్రారంభించబడింది. ధర్మాబాద్ నుండి మేడ్చల్ మధ్య 172 కిలోమీటర్ల దూరంలో 20 స్టేషన్లను కలుపుతూ కవచ్ ఐఆర్ యొక్క స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.నిజామాబాద్లో పిఎఫ్ నెం.1 ,2 లను షంటింగ్ నెక్కు అనుసంధానించే యార్డ్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. జానకంపేట స్టేషన్లో రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు రెండు అదనపు లూప్ లైన్ల ఏర్పాటు పూర్తయింది.ఆర్మూర్ – మామిడిపల్లి స్టేషన్ల మధ్య రూ. 38 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం , మామిడిపల్లి – నిజామాబాద్ స్టేషన్ల మధ్య రూ. 25 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి ( ఆర్ ఓ బి)నిర్మాణం పూర్తయింది.అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 58 కోట్ల వ్యయంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నారు.ఈ విభాగానికి సంబంధించి కవచ్ను వెర్షన్ 4.0 కి అప్గ్రేడ్ చేయడానికి ఆమోదం లభించింది పనులు వేగంగా జరుగుతున్నాయి.

నిజామాబాద్లో సుమారు రూ. 8.80 కోట్ల అంచనా వ్యయంతో ప్రాంగణ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. నిజామాబాద్లో రూ. 124 కోట్ల వ్యయంతో 2కిలోమీటర్ల పొడవున బైపాస్ లైన్ను మంజూరు చేయగా, పనులు కోనసాగుతు ఉన్నాయి.నిజామాబాద్లో రూ. 6.64 కోట్ల వ్యయంతో త్వరిత నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మరో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లకు (ఆర్ఓబి) మంజూరు కాగాఈ పనులను 100 శాతం రైల్వే ఖర్చుతో చేపడుతున్నారు.జన్కంపేట్ స్టేషన్లో సుమారు రూ. 9 కోట్ల వ్యయంతో గూడ్స్ షెడ్ అభివృద్ధికి అనుమతి మంజూరైంది.నిజామాబాద్ ప్రాంతం సమీపంలో సరుకు రవాణా వస్తువుల నిర్వహణ సౌకర్యాలు మరింత విస్తరించడానికి జంకంపేట్ గూడ్స్ షెడ్ అభివృద్ధి చేయబడింది. 700/16 మీటర్ల స్లీపర్ మ్యాటింగ్తో గూడ్స్ ప్లాట్ఫారమ్ నిర్మించబడింది.సాయంత్రం వేళల్లో సౌకర్యవంతంగా లోడింగ్ / అన్లోడింగ్ చేయడానికి వీలుగా గూడ్స్ ప్లాట్ఫారమ్ ప్రాంతం సమీపంలో 8 ఎత్తైన హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా బియ్యం, మొక్కజొన్న, జొన్న మొదలైన సరుకులను లోడ్ చేస్తుండగా, ఎరువులు, సిమెంట్ మొదలైన వాటిని అన్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గూడ్స్ షెడ్లో 10 నుంచి 12 ర్యాకుల లోడింగ్ 15-17 ర్యాకుల అన్లోడింగ్ జరుగుతుంది. ఈ గూడ్స్ షెడ్లో సరుకు రవాణా రైళ్ల నిర్వహణ సరుకులను మరింత పెంచేందుకు అవకాశం ఉంది.

