29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి            

Must read

📰 Generate e-Paper Clip

 

ఆర్మూర్, బతుకమ్మ:

ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్‌కు చెందిన పన్నీరు శ్రీనివాస్ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ  విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో బోర్ మోటార్ మరమ్మతు చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు. శ్రీనివాస్ కరెంట్ షాక్ తో మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

More articles

Latest article