24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్‌లో పీఎం రాహత్ స్కీమ్‌పై అవగాహన వర్క్‌ షాప్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న “పీఎం రాహత్ స్కీమ్” పై నిజామాబాద్‌లోని ఐఎంఏ మీటింగ్ హాల్‌లో శనివారం ప్రత్యేక అవగాహన వర్క్‌ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మస్తాన్ అలీ, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల వరకు లేదా ఏడు రోజుల పాటు ఉచిత వైద్య చికిత్స అందించబడుతుందని తెలిపారు. జిల్లా పరిధిలోని 38 ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఈ పథకం అమలులో సమన్వయంతో పనిచేసి, బాధితులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆసుపత్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్క్‌ షాప్‌లో శిక్షణ అందించిన ఈదార్ మేనేజర్ వర్షా నిహంత్ మాట్లాడుతూ, త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో ఈ పథకం అమలులోకి రానుందని తెలిపారు. ఈ స్కీమ్ విజయవంతంగా అమలు కావాలంటే పోలీసు శాఖ, ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖల సహకారంతోనే ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని వివరించారు. టెక్నికల్ పరమైన సహాయ సహకారాల కోసం ఎన్‌ఐసీ విభాగం ముందుండి పనిచేస్తుందని జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. విశాల్, జిల్లా కార్యదర్శి సృజన్, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్ రెడ్డి, వివిధ ఆసుపత్రుల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Awareness workshop on PM Rahat Scheme in Nizamabad

More articles

Latest article