నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ మండలంలో నిర్మిస్తున్న నూతన గ్రంథాలయ భవనానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. నూతన గ్రంథాలయ భవనానికి ప్రభుత్వం నుంచి రూ.45 లక్షలు మంజూరు అవడంతో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ అంతి రెడ్డి రాజిరెడ్డి, నందిపేట్ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, ఉప సర్పంచ్ చందర్, మండల పార్టీ అధ్యక్షుడు మందమైపాల్, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
