. . . తహసీల్దార్ మల్లయ్య
ఏర్గట్ల, బతుకమ్మ :
రైతులు ఐకెపి వరి ధాన్యము కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఏర్గట్ల మండల తాసిల్దార్ మల్లయ్య పేర్కొన్నారు. రైతులతో మాట్లాడుతూ క్వింటాలకు రు. 2389/ ఏ గ్రేడ్ రకానికి, రూ.2369/ బిగ్రేడ్ రాకానికి మద్దతు ధర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తోర్తి సర్పంచ్ కౌడ పెద్ద భూమేశ్వర్, ఉప సర్పంచ్ గొల్లపల్లి సుమన్ గౌడ్, గుమ్మిర్యాల్ సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్, ఉప సర్పంచ్ జైడి కిషోర్ రెడ్డి, నాగేంద్రనగర్ సర్పంచ్ సండే రంజిత్, ఉప సర్పంచ్ షేక్ జాకీర్, గ్రామాల రైతులు ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్, సిసి రవికుమార్, ఆర్ ఐ, ఆయా గ్రామాల మహిళా సమాఖ్య ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.
